ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగమవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగమవ్వాలి

Jun 19 2025 3:58 AM | Updated on Jun 19 2025 3:58 AM

ప్రతి

ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగమవ్వాలి

మంత్రాలయం: యోగాతోనే ఆరోగ్యం సాధ్యమని శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం రాఘవేంద్రస్వామి మఠం ముంగిట మధ్వ కారిడార్‌లో యోగా చేపట్టారు. ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ నేతృత్వంలో యోగాంధ్రను నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ యోగా ప్రతి మానవుడి జీవితంలో భాగం కావాలని కోరారు. యోగాతో ఆరోగ్య రీత్యా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ యోగా పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా భరతనాట్య ప్రదర్శన, యోగా ఆసనాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగమవ్వాలి1
1/1

ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగమవ్వాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement