
హామీల అమలులో ‘కూటమి’ విఫలం
కొలిమిగుండ్ల: సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు లాయర్ మహేశ్వరరెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి సిద్దంరెడ్డి రామ్మోహన్రెడ్డి, నాయకులతో కలిసి బుధవారం ‘జగన్ అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం’ అనే వెన్నుపోటు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక ప్రజలకు మంచి సేవలు అందించాల్సింది పోయి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడటం, ఆస్తులను ధ్వంసం చేయడం పనిగా పెట్టుకున్నారన్నారు. ఏడాది పాలనలోనే ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై పూర్తిగా వ్యతిరేకత ఏర్పడిందన్నారు. గతంలో ఎన్నడూ చూడని పరిస్థితులు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారన్నారు. ప్రజలకు ఏదైనా చెప్పాడంటే చేస్తాడనే చేస్తాడనే నమ్మకాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలుపుకున్నారన్నారు. చంద్రబాబు మాత్రం చెప్పింది చేయడని మరోసారి రుజువు చేశారని పేర్కొన్నారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. విద్య, వైద్యరంగాలతో పాటు వ్యవసాయం పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయిందన్నారు. ఏడాది కూటమి పాలనను ప్రజలు చాలా స్పష్టంగా గమనించారన్నారు. నాయకులు పేరం సత్యనారాయణరెడ్డి,రామసుబ్బయ్య,కామిని గోపాల్రెడ్డి, కంబయ్య, గోపాల్రెడ్డి, సోమశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి