
రేపటి నుంచి విజయీంద్రతీర్థుల ఆరాధనోత్సవాలు
హొళగుంద: స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీ విజయీంద్ర తీర్థుల 411వ ఆరాధన మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 20వ తేదీన గురువారం ధ్వజారోహణ, ప్రార్థనోత్సవం, గోపూజ, లక్ష్మపూజ, 21న పూర్వరాధన, 22న ఏకాదశి పూ జలు, 23న మధ్యారాధన, 24న ఉత్తరాధన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదేరోజు శ్రీపురందరదాసర భజన మండలి, భక్తి భారతి కోలాటా ల మండలి బృందాలతో భజనలతో రథోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
శ్రీమఠం పీఠాధిపతికి ఆహ్వానం
విజయీంద్ర తీర్థుల 411వ ఆరాధన మహోత్సవాలకు మంత్రాలయంలోని శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులను బుధవారం ఆహ్వానించారు. ఉత్సవ నిర్వాహకులు, విజయీంద్ర తీర్థుల సేవా ట్రస్ట్ సభ్యులు పవనాచారి, రఘునాథాచారి, పాండురంగాచారి, మురళిధరాచారి, వెంకటేశాచారి, రాఘవేంద్రాచారి ఆహ్వాన పత్రికను అందించారు.