సాంకేతిక విద్యపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక విద్యపై దృష్టి సారించాలి

Jun 18 2025 3:53 AM | Updated on Jun 18 2025 3:53 AM

సాంకేతిక విద్యపై దృష్టి సారించాలి

సాంకేతిక విద్యపై దృష్టి సారించాలి

పాణ్యం: సాంకేతిక విద్యపై దృష్టి సారిస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గనియా విద్యార్థులకు సూచించారు. మంగళవారం పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద ఏపీ మోడల్‌ స్కూల్‌ను కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, నెలకొన్న సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె అర గంట పాటు ఉపాధ్యాయురాలిగా మారిపోయి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించారు. చాక్‌పీస్‌ చేతబట్టి బోర్డు రాసి క్లుప్తంగా వివరించారు. విద్యార్థులను పలు ప్రశ్నలు వేసి ఉత్సాహ పరిచారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. భోజనం రుచి చూసి విద్యార్థుల అభి ప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సమయాన్ని వృథా చేయకుండా కష్టపడి చదివి పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల ప్రహరీ నిర్మాణం, రోడ్డు సౌకర్యం, బస్సు పాఠశాల వద్దకు చేరుకునేలా చొరవ చూపుతానని హామీ ఇచ్చా రు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్‌ దినేష్‌కుమార్‌, వైస్‌ ప్రిన్సిపా ల్‌ భారతి, ఎంఈఓ కోటయ్యను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement