
మా పాఠశాలను రద్దు చేయొద్దు
చాగలమర్రి: దాదాపు 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పెద్దవంగలి ఎస్సీ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుండటంతో కాలనీ వాసులు ఆందోళన బాటపట్టారు. పాఠశాలలో 10 మంది విద్యార్థులుండగా వారిలో నలుగురిని ప్రధాన పాఠశాలకు బదిలీ చేయగా, మరో నలుగురు ఇతర ప్రైవేటు పాఠశాలలో చేరారు. దీంతో ఇద్దరు విద్యార్థులు మాత్రమే పాఠశాలలో మిగిలారు. పాఠశాల రద్దు చేస్తున్నారని తెలుసుకున్న ఎస్ఎంసీ చైర్మన్ సతీష్, కాలనీవాసులు స్టిఫెన్బాబు, అనిల్ కుమార్, దాన మ్మ తదితరులు పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడు సుబ్బయ్యను అడిగి ఆరా తీశారు. పాఠశాలను రద్దు చేస్తే ఆందోళన చేస్తామన్నారు. కాగా ఈ విషయంప ఎంఈఓ అనురాధను వివరణ కోరగా.. అంగన్వాడీ పాఠశాలతో కలిపి ఫౌండేషన్ పాఠశాల మార్పు చేసి 1, 2 తరుగతులు కొనసాగుతాయన్నారు.
ఓటరు జాబితా తయారీలో భాగస్వాములుకండి
ఆళ్లగడ్డ: స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కీలకమని నంద్యాల ఆర్డీఓ విశ్వనాఽథ్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని సమావేశ భవనంలో మంగళవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా రూపకల్పనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా నూతన ఓటరు నమోదు, మార్పుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో బూత్స్థాయి అధికారులు, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నాయకులు అధికారులకు, బీఎల్ఓలకు సహకరించాలని సూచించారు. సమావేశంలో తహసీల్దార్ రత్నకుమారి, బీఎల్ఓలు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణకు కార్డెన్ సెర్చ్
బొమ్మలసత్రం: నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ అధిరాజ్సింగ్ తెలిపారు. మంగళవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనుమానితులు, నేరచరిత్ర ఉన్నవారి ఇళ్లలో ప్రత్యేకంగా సోదాలు చేపడుతున్నామని వివరించారు. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా సరైన ధ్రువపత్రాలు లేని 83 బైక్లు, 3 ఆటోలను స్వా ధీనం చేసుకున్నామన్నారు. గ్రామాల్లో గొడవలు, అల్లర్లు జరగకుండా పోలీసులు శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి నిలాపారన్నారు. రౌడీషీటర్లు వారి ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని సమాజంలో గౌర వంగా జీవించాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో అనవసరంగా రహదారులపై బైక్లపై తిరగవద్దని యువతకు సూచించారు.

మా పాఠశాలను రద్దు చేయొద్దు