వాడాలలో కార్డెన్‌ సెర్చ్‌ | - | Sakshi
Sakshi News home page

వాడాలలో కార్డెన్‌ సెర్చ్‌

Jun 17 2025 4:58 AM | Updated on Jun 17 2025 4:58 AM

వాడాల

వాడాలలో కార్డెన్‌ సెర్చ్‌

పాములపాడు: వాడాల గ్రామంలో ఆత్మకూరు రూరల్‌ సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ సురేష్‌బాబులు తమ సిబ్బందితో సోమవారం తెల్లవారుజాము నుంచి కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అనుమానిత వ్యక్తులు, రౌడీ షీటర్ల ఇళ్లలో సోదాలు చేశారు. గ్రామ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలను నివారించడమే లక్ష్యంగా పోలీసులు ప్రజల కోసమే ఉన్నారన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అలాంటి వారి వివరాలు తెలియజేయాలని, చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. వారి వెంట హెడ్‌ కానిస్టేబుల్‌ రమణ, కానిస్టేబుళ్లు ఖాజా, యాగంటి, శివకుమార్‌, రసూల్‌ తదితరులు ఉన్నారు.

కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు

నందికొట్కూరు: ప్రాచీన సంగమేశ్వర పుణ్య క్షేత్రాన్ని కృష్ణా జలాలు చుట్టుముడుతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో బ్యాక్‌ వాటర్‌ పెరుగుతోంది. దీంతో సంగమేశ్వరం క్షేత్రం గర్భాలయంతో పాటు ఆలయ మండపం వరకు నీళ్లు చేరాయి. తీరం వెంబడి జలకళ సంతరించుకుంది.

డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పు

నంద్యాల(న్యూటౌన్‌): ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండటంతో ఈనెల 20, 21 తేదీల్లో నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్ష తేదీలను జూలై 1, 2తేదీకి ప్రభుత్వం మార్చినట్లు డీఈఓ జనార్దన్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఈ మార్పు కారణంగా అభ్యర్థులు యోగా డే కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయాణాల నిర్వహణలో అంతరాయం లేకుండా పరీక్షలకు హాజరు కావచ్చని తెలిపారు. మార్చిన హాల్‌టికెట్లు, ఈనెల 20వ తేదీ నుంచి https://apdsc.apcfss.in లో అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకొని పరీక్షలకు హాజరు కావాలన్నారు.

కొనసాగుతున్న పరీక్షలు: జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో సోమవారం ఉదయం జరిగిన ఎస్‌ఏ సోషియల్‌ పరీక్షకు 870 మందికి గాను 832 మంది హాజరు కాగా 38 మంది గైర్హాజరైనట్లు డీఈఓ తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 870 మందికి గాను 848 మంది హాజరు కాగా 22 మంది గైర్హాజరయ్యారన్నారు.

శ్రీమఠంలో కేంద్ర మంత్రి

మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి దర్శనార్థం కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఆదివారం రాత్రి మంత్రాలయం వచ్చారు. స్థానిక నరహరి తీర్థ అతిథి గృహంలో విడది చేసిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం శ్రీమఠం వచ్చారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు హారతులు పట్టి అర్చనలు చేశారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావన దర్శనంతో మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానం తరం రాయచూరు జిల్లా కొల్హాపూర్‌ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మ వారి దర్శనం ముగించుకుని మధ్యాహ్నం మంత్రాలయం వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఆయ నను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. రాత్రి శ్రీమఠంలో రథోత్సవాలను తిలకించారు.

వాడాలలో కార్డెన్‌ సెర్చ్‌ 1
1/2

వాడాలలో కార్డెన్‌ సెర్చ్‌

వాడాలలో కార్డెన్‌ సెర్చ్‌ 2
2/2

వాడాలలో కార్డెన్‌ సెర్చ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement