
అర్ధరాత్రి నుంచే క్యూలో.
నెక్కంటి జంగిల్ రైడ్ పేరుతో మంజూరు చేసే ఇష్టకామేశ్వరిదేవి ఆలయ సందర్శనకు వెళ్లాలంటే ఒకరోజు ముందుగానే టికెట్లు మంజూరు చేస్తారు. అంటే రేపు వెళ్లాలంటే ఈ రోజు టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. రోజుకు 104 టికెట్లు మాత్రమే కరెంట్ బుకింగ్ ద్వారా ఇస్తారు. క్యూలైన్లో ఉన్న ఒక్కక్కరికి మూడు టికెట్లు మాత్రమే ఇస్తారు. తక్కువ టికెట్లు ఇవ్వడం, అసక్తి చూపే భక్తులు ఎక్కువగా ఉండడంతో భక్తులు టికెట్లు పొందేందుకు అర్ధరాత్రి 12 గంటల నుంచి శిఖరేశ్వరం వద్దగల నెక్కంటి జంగిల్రైడ్ క్యాంప్ కార్యాలయం వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఉదయం 8 గంటల నుంచి టికెట్లు మంజూరు చేస్తారు. ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శనకు వెళ్లాలంటే శ్రీశైలంలో మూడు రోజులు భక్తులు బస చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా శ్రీశైలం నుంచి సొంత వాహనాలు లేని భక్తులు ఆటోలకు రాత్రి, తెల్లవారుజాము వేళలలో రావాలంటే ఆటో వాళ్లు ఇష్టం వచ్చిన రీతిలో డబ్బులు వసూలు చేస్తూ భక్తుల జేబులను ఖాళీ చేస్తున్నారు. రాత్రి వేళల్లో శిఖరేశ్వరం వద్ద తరచూ ఎటుగుబంట్లు, చిరుత పులులు సంచరించడం పరిపాటిగా మారింది. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయపడాల్సి వస్తోంది. అధికారులు చర్యలు తీసుకుని భక్తులు కోరుతున్నారు.

అర్ధరాత్రి నుంచే క్యూలో.