అటవీ శాఖ అనుమతి ఉన్న వాహనాల్లోనే.. | - | Sakshi
Sakshi News home page

అటవీ శాఖ అనుమతి ఉన్న వాహనాల్లోనే..

Jun 17 2025 4:58 AM | Updated on Jun 17 2025 4:58 AM

అటవీ శాఖ అనుమతి ఉన్న వాహనాల్లోనే..

అటవీ శాఖ అనుమతి ఉన్న వాహనాల్లోనే..

ఇష్టకామేశ్వరీ ఆలయ సందర్శనకు రోజుకు 16 టికెట్లు ఆన్‌లైన్‌లో, 104 టికెట్లు కరెంట్‌ బుకింగ్‌ ద్వారా మొత్తం 120 టికెట్లు మాత్రమే మంజూరు చేస్తారు. ఒక్కో టికెట్టు ధర రూ.1,000 అటవీశాఖ నిర్ణయించింది. శ్రీశైలానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని శిఖరేశ్వరం వద్ద ఇష్టకామేశ్వరీ ఆలయ సందర్శన టికెట్లు మంజూరు చేస్తారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ మూడు నెలలు పులుల పునరుత్పత్తి కారణంగా ఇష్టకామేశ్వరీ ఆలయ సందర్శనకు అనుమతించరు. ఈ మూడు నెలలు కాక సంవత్సరంలో మిగిలిన అన్ని రోజులు ఇష్టకామేశ్వరీ అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. టికెట్లు పొందిన భక్తులను అటవీశాఖ ప్రైవేట్‌ జీపులను ఏర్పాటు చేసి ఆ జీపుల ద్వారా భక్తులను అమ్మవారి ఆలయం వద్దకు తీసుకెళ్లి, దర్శనం అనంతరం శిఖరేశ్వం వద్ద భక్తులను దింపేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement