
వడదెబ్బతో మహిళ మృతి
కోవెలకుంట్ల: పట్ట ణంలోని నాగులకట్ట సమీపంలో మంగళవారం సాయంత్రం వడదెబ్బతో ఓ మహి ళ మృతి చెందింది. స్థానికులు అందించి న సమాచారం మేరకు.. మండలంలోని భీమునిపాడుకు చెందిన సారమ్మ ఉదయం మిరపకోత పనికి వెళ్లింది. ఎండ తీవ్రత కారణంగా ఇంటికి చేరుకుని అనారోగ్యంగా ఉండటంతో చికిత్స నిమిత్తం కోవెలకుంట్లకు వచ్చింది. ఆసుపత్రికి దగ్గరకు వెళ్లేలోపే అపస్మారక స్థితికి చేరుకుని కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల వారు గమనించి ముఖంపై నీళ్లుచల్లగా ఎలాంటి చలనం లేకపోవడంతో పక్కనే ఉన్న ప్రైవేట్ డాక్టర్కు సమచారం ఇచ్చారు. ఆయన మహిళను పరిశీలించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అక్కడున్న వ్యక్తులు మృతురాలి సంచిలో ఉన్న ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు.
43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోయాయి. వడగాల్పుల తీవ్రత పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దొర్నిపాడు 43.9, మిడుతూరు 43.3 డిగ్రీలు, నందికొట్కూరు 43.3 డిగ్రీలు, పాణ్యం 43.7 డిగ్రీల ప్రకారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా కర్నూలు అర్బన్లో 43.5, కౌతాళంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గోస్పాడు, పాములపాడు, బండిఆత్మకూరు, సంజామల, శిరువెళ్ల, నంద్యాలల్లో
కూడా 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా విపత్తుల నిర్వహణ అధికారి డీపీఎం అనుపమ తెలిపారు.
సీహెచ్ఓల నిరసన దీక్ష
గోస్పాడు: సీహెచ్ఓల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని ఏపీఎన్సీఏ జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ, జనరల్ సెక్రటరీ గురుప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాలలోని డీఎంఅండ్హెచ్ఓ కార్యాలయం వద్ద సీహెచ్ఓలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్ కింద సీహెచ్ఓ, ఎంఎల్హెచ్పీలు పని చేస్తున్నారని తెలిపారు. ఆరు సంవత్సరాలు దాటిన సీహెచ్ఓలను క్రమబద్ధీకరించాలని, 23శాతం ఇంట్రిమెంట్ ఇవ్వాలని, ప్రతి నెలా వేతనంతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎంఅండ్హెచ్ వెంకటరమణకు వినతి పత్రం అందజేశారు.

వడదెబ్బతో మహిళ మృతి