
‘మిషన్ పరివర్తన్’తో.. యువతలో మార్పు
మత్తుకు దూరం చేసి.. కొలువులకు దగ్గర చేశాం
ఫ ‘యువతేజం’తో వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం
ఫ గంజాయి రహిత జిల్లాగా మార్చుడమే లక్ష్యంగా పని చేస్తున్నాం
ఫ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ
ఫ ‘సాక్షి’తో ఎస్పీ శరత్చంద్ర పవార్
ఫ ఎస్పీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి
ప్రత్యేకంగా
కేసులు ఫాలోఅప్
కేసులు నమోదు చేయడం, వదిలేయడం కాకుండా కేసులను ఫాలోఅప్ చేయడంపై ప్రత్యేకంగా దృష్టిసారించేలా కృషి చేస్తున్నా. ఇదే విషయాన్ని మా సిబ్బందికి చెబు తున్నా. తద్వారా ఛార్జిషీట్లు పక్కాగా నమోదు చేయడంతో కోర్టుల్లో శిక్షలు పడేలా చూస్తున్నాం. గతేడాది ఆరు నెలల్లో 6 కేసుల్లో, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 9 కేసుల్లో జీవిత కారాగార
శిక్ష పడింది.
యువతను దారిలో పెడుతున్నాం
జిల్లా మీదుగా గంజాయి రవాణా జరుగుతోంది. జిల్లాకు వచ్చిన మొదట్లోనే ఈ విషయాన్ని గుర్తించా. అప్పుడే గంజాయి అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టా. జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టాం. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల తరహాలో గంజాయి టెస్ట్ కిట్లను అందించి గంజాయికి బానిస అవుతున్న యువతను గుర్తించి దారిన పెట్టాలని నిర్ణయించుకున్నాం. దాదాపు 400 మందికి వారి తల్లిదండ్రుల సమక్షంలో సైకియాట్రిస్ట్లతో కౌన్సెలింగ్ ఇప్పించాం. గంజాయి సేవించడం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై పడే ప్రభావం వివరించి మార్పు తెచ్చాం.
హెల్త్ క్యాంపులతో
20 మందికి అత్యవసర చికిత్స
పోలీసు కుటుంబాల సంక్షేమం, ఆరోగ్యాగానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహించి అత్యవసర చికిత్స అవసరమైన వారిని గుర్తించి వైద్య సేవలు అందించాం. తద్వారా దాదాపు 20 మందిని ప్రాణాపాయం నుంచి కాపాడగలిగాం. మిగతా వారికి వైద్య సహాయం అందించాం. చందంపేట మండలంలోని పోలేపల్లిలో మెగా హెల్త్ క్యాంపును నిర్వహించి గిరిజనులను ఆదుకున్నాం.

‘మిషన్ పరివర్తన్’తో.. యువతలో మార్పు