
విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి
మిర్యాలగూడ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ భిక్షపతి అన్నారు. గురువారం మిర్యాలగూడలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1438 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని అందులో 229 హైస్కూల్స్, 117యూపీఎస్, 1100కి పైగా ప్రైమరీ స్కూల్స్, 27 కేజీబీవీలు, 17 మోడల్ స్కూల్స్ ఉన్నాయన్నారు. ఆగస్టు 31తో అడ్మిషన్ల గడువు ముగుస్తుందని.. అప్పటిలోగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులు లేని ప్రభుత్వ పాఠశాలలు 24 ఉన్నట్లు గుర్తించామని వాటిని మూసివేస్తామని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పది పాఠశాలలను తిరిగి పునః ప్రారంభించినట్లు వెల్లడించారు. ఆయన వెంట ఎంఈఓ బాలునాయక్ ఉన్నారు.