సైబర్‌ మోసాలకు గురైతే ఫిర్యాదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసాలకు గురైతే ఫిర్యాదు చేయాలి

Jun 20 2025 6:35 AM | Updated on Jun 20 2025 6:35 AM

సైబర్

సైబర్‌ మోసాలకు గురైతే ఫిర్యాదు చేయాలి

నల్లగొండ : సైబర్‌ నేరగాళ్లు టెక్నాలజీ ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారని.. మోసపోయామని తెలిసిన వెంటనే 1930 నంబర్‌కు ఫోన్‌ద్వారా ఫిర్యాదు చేయాలని సైబర్‌ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సైబర్‌ వారియర్స్‌తో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్‌ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, మెసేజ్‌లు ఓపెన్‌ చేయొద్దని సూచించారు. మోసపూరితమైన ఆన్‌లైన్‌ యాప్‌లలో అధిక వడ్డీ ఆశ చూపి, పెట్టుబడికి రెట్టిపు సొమ్ము వస్తాయని అనేక మంది అమాయకులను మోసం చేస్తున్న కేసులు నమోదు అవుతున్నాయని.. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

సైబర్‌ మోసాలకు గురైతే ఫిర్యాదు చేయాలి1
1/1

సైబర్‌ మోసాలకు గురైతే ఫిర్యాదు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement