
సైబర్ మోసాలకు గురైతే ఫిర్యాదు చేయాలి
నల్లగొండ : సైబర్ నేరగాళ్లు టెక్నాలజీ ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారని.. మోసపోయామని తెలిసిన వెంటనే 1930 నంబర్కు ఫోన్ద్వారా ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైం డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ వారియర్స్తో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులు, మెసేజ్లు ఓపెన్ చేయొద్దని సూచించారు. మోసపూరితమైన ఆన్లైన్ యాప్లలో అధిక వడ్డీ ఆశ చూపి, పెట్టుబడికి రెట్టిపు సొమ్ము వస్తాయని అనేక మంది అమాయకులను మోసం చేస్తున్న కేసులు నమోదు అవుతున్నాయని.. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

సైబర్ మోసాలకు గురైతే ఫిర్యాదు చేయాలి