
అమ్మా.. మొర ఆలకించరూ..
నల్లగొండ : ‘ఏళ్ల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావడం లేదు. తిరిగితిరిగి అలసిపోతున్నాం. మీరే మా మొర ఆలకించి సమస్యలను పరిష్కరించాలి’ అంటూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎదుట పలువురు బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇతర సమస్యలపై కలెక్టరేట్కు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజల నుంచి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను సావదానంగా విన్నారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని ఆయా శాఖలకు పంపారు. ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ఏడేళ్ల నుంచి తిరుగుతున్నా..
పింఛన్ రావడం లేదు
నేను దివ్యాంగుడిని. నడవలేను. నా సొంత పనులకు కూడా ఇతరులపై ఆధారపడాల్సిందే. ఏడేళ్ల నుంచి వికలాంగుల పింఛన్కు దరఖాస్తు చేసుకున్నా. అధికారులు, కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా నా సమస్యకు పరిష్కారం లభించలేదు. పింఛన్ పొందలేకపోతున్నా. పింఛన్ వస్తే నా కుటుంబ సభ్యులకు భారం తగ్గుతుంది. నాకు పింఛన్ ఇప్పించాలి.
– మదు, చెరలతండా, నేరడుగొమ్ము మండలం

అమ్మా.. మొర ఆలకించరూ..