
గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలి
నల్లగొండ టౌన్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9న కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్లో సీపీఎం శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, మహమ్మద్ అబ్బాస్ అన్నారు. నల్లగొండలో జరుగుతున్న రాజకీయ శిక్షణ తరగతుల్లో సోమవారం వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించడంతో కార్మిక వర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ప్రస్తుత వర్షాకాలం సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులను అందుబాటులో ఉంచాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, సయ్యద్ హాశం, దండెంపల్లి సత్తయ్య, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సలీం, కొండ అనురాధ, నలపరాజు సైదులు, మన్నెం భిక్షం, కానుగు లింగస్వామి, పులెంల శ్రీకర్, తుమ్మల పద్మ, సరోజ, కొండ వెంకన్న, రాములు తదితరులు పాల్గొన్నారు.