
క్షయ స్క్రీనింగ్ పరీక్షలు పెంచాలి
నల్లగొండ : క్షయ వ్యాధి స్క్రీనింగ్ పరీక్షలు పెంచాలని స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన క్షయ (టీబీ) ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025– 26 నాటికి క్షయ రహిత జిల్లాగా మార్చాలన్నారు. పరీక్షలను వేగవంతం చేసి క్షయ రోగులను గుర్తించి వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా టీబీ పరీక్షలు చేయాలని సూచించారు. టీబీ సోకిన వారికి కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.వెయ్యి ఇస్తుందని.. టీబీ రోగులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ జిల్లాలో 3 వేల క్షయ కేసులు ఉన్నాయన్నారు. టీబీ నివారణకు ప్రచార కార్యక్రమాలు చేపట్టి ఇంత వరకు 67 శిబిరాలను నిర్వహించి 13 వేల మందికి క్షయ పరీక్షలు చేసామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్రెడ్డి, ఆర్డీఓ వై.అశోక్రెడ్డి, ఇన్చార్జి జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, బ్లేస్సి ఎస్తర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్