విషం తాగి మహిళ ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

విషం తాగి మహిళ ఆత్మహత్యాయత్నం

Jun 15 2025 9:11 AM | Updated on Jun 15 2025 9:11 AM

విషం తాగి మహిళ ఆత్మహత్యాయత్నం

విషం తాగి మహిళ ఆత్మహత్యాయత్నం

సకాలంలో స్పందించి కాపాడిన పోలీసులు

నాగార్జునసాగర్‌: నాగార్జునసాగర్‌లోని పైలాన్‌కాలనీలో గల జెన్‌కో కార్యాలయం వద్ద శనివారం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ ప్రాణాలను విజయపురిటౌన్‌ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన జస్విత(28) భర్త, అత్తమామల నుంచి వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో శనివారం ఆమె కారులో ఒంటరిగా బయల్దేరి మధ్యాహ్నానానికి నాగార్జునసాగర్‌లోని పైలాన్‌కాలనీ జెన్‌కో కార్యాలయం వద్ద గల ఏటీఎం వద్దకు చేరుకుంది. అక్కడ తనతో పాటు తెచ్చుకున్న విషయం తాగి కారులోనే కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి తాను విషం తాగినట్లు చెప్పింది. హైదరాబాద్‌లోనే ఉంటున్న జస్విత తండ్రి సూర్య కూకట్‌పల్లి హౌజింగ్‌ బోర్డ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వారు నాగార్జునసాగర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ సంపత్‌ తన సిబ్బందితో కలిసి టెక్నాలజీ సహాయంతో జస్విత ఉన్న ప్రాంతాన్ని తెలుసుకుని కారులో అపప్మారకస్థితిలో ఉన్న ఆమెను స్థానిక కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమె తల్లిదండ్రులకు అప్పగించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. సకాలంలో స్పందించిన పోలీసులకు జస్విత తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement