
నడిపించిన నాన్న
●
ఆటో నడుపుతూ..
కొడుకును ఎంబీబీఎస్ చదివిస్తూ..
భువనగిరి : భువనగిరి పట్టణంలోని పహడీనగర్కు చెందిన షేక్ జహంగీర్, నసీం దంపతులకు కుమారుడు అద్నాన్, కుమార్తె ఉన్నారు. తన కొడుకును డాక్టర్ చేయాలని జహంగీర్ సంకల్పించాడు. వివాహం తర్వాత కొన్ని సంవత్సరాలు భువనగిరి నుంచి చౌటుప్పల్కు వెళ్లి అక్కడ వెల్డింగ్ వర్క్షాపులో పనిచేస్తూ తమ పిల్లలను చదివిస్తూ, కుటుంబాన్ని పొషించాడు. కొన్ని సంవత్సరాల క్రితం వలిగొండ నుంచి భువనగిరికి బైక్పై వస్తుండగా అనాజీపురం వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. గాయాల నుంచి కోలుకున్న అనంతరం ఆటో కొనుగోలు చేసి భువనగిరిలో నడుపుకుంటూ పిల్లల చదువును కొనసాగించాడు. పిల్లల చదువుల కోసం అప్పులు సైతం చేశాడు. ఇంటర్ పూర్తయిన వెంటనే నీట్ ర్యాంకు రాలేదు. రెండేళ్లు కోచింగ్ ఇప్పించాడు. అద్నాన్ 2023లో నీట్ ర్యాంకు సాధించి ప్రస్తుతం జనగాంలోని ప్రభుత్వం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె ఓ ప్రైవేట్ కళాశాలలోనే బీటెక్ చదువుతోంది. పిల్లల చదువు కోసం రూ.లక్షలు అప్పు చేశాడు. అప్పులను తీర్చేందుకు ఆటో నడుతుతూనే ఉన్నాడు జహంగీర్.
కొడుకు కలను నెరవేర్చి
చౌటుప్పల్ : చౌటుప్పల్కు చెందిన వీరమళ్ల శ్రీమన్నారాయణ–విజయ దంపతులకు కుమారుడు దయాకర్, కుమార్తె రాజ్యలక్ష్మి ఉన్నారు. శ్రీమన్నానారాయణకు ఆరుగురు అన్నదమ్ముళ్లు. ఉమ్మడి కుటుంబంలో మొదలైన కష్టాలు వారికి ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. తాము అనుభవించిన కష్టాలు తమ బిడ్డలకు రావొద్దన్న ఆలోచనతో ఈ దంపతులు ఎంతో శ్రమించారు. ప్రస్తుతం గ్రామాల్లోని కిరాణా దుకాణాలకు మార్కెటింగ్ చేస్తున్నాడు. దయాకర్ చిన్నతనం నుంచి కోరుకున్న విధంగా డాక్టర్గా తీర్చిదిద్దాడు. తనకు వచ్చిన సంపాదనతో ఉన్నంతలోనే ఖర్చు చేసుకొని కొంత మొత్తాన్ని కుమారుడి ఎదుగుదల కోసం వెచ్చించాడు. అలా వైద్య విద్య పూర్తి చేసుకున్న దయాకర్ చౌటుప్పల్లోనే తల్లిదండ్రుల వద్ద ఉంటూనే స్థానికంగా ఉన్న నాలుగు పరిశ్రమల్లో ఫ్యాక్టరీ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం డాక్టర్గా మంచిస్థానంలోనే ఉన్నాడు.
ఫ పిల్లల విజయాన్ని తమ గెలుపుగా భావిస్తున్న నాన్నలు
ఫ సంతానాన్ని సమాజంలో ఉన్నతంగా నిలబెట్టేందుకు కృషి
ఫ బిడ్డల ఆశలే ఆయువుగా.. వారి గెలుపే లక్ష్యంగా ముందుకు
నేడు
ఫాదర్స్ డే
నాన్న ఎంతో శ్రమించారు
మాది పేద కుటుంబం. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. నన్ను చిన్నతం నుంచి హైదరాబాద్లోనే హాస్టల్ ఉంచి చదివించాడు. డాక్టర్ కావాలన్న నా చిన్ననాటి కోరికను నెరవేర్చేందుకు అమ్మానాన్నలు పడిన కష్టం ఎన్నటికీ మరువలేను. కుటుంబం గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో కూడా నాకు ఏ లోటూ రాకుండా చూశారు. చదువు పూర్తవ్వగా ప్రస్తుతం ఫ్యాక్టరీ మెడికల్ ఆఫీసర్గా పని చేస్తున్నాను. ఇకపై నా తల్లితండ్రులకు ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటాను. – వీరమళ్ల దయాకర్
పెద్దవూర: మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన నిరుపేద దళిత కుటుంబానికి చెందిన చినపాక లక్ష్మీనారాయణ–మంజుల దంపతులకు ఇద్దరు కుమారులు రాకేష్, రితీష్ ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబంలో జన్మించిన లక్ష్మీనారాయణ ఆర్థిక పరిస్థితులతో ఉన్నత చదువులు చదవలేకపోయాడు. కార్మిక నాయకుడిగా పనిచేస్తూ తన పిల్లలను చదివిస్తున్నాడు. దీంతో తన కుమారులనైనా ఉన్నతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చిన్నప్పటినుంచే చదువుతో కలిగే ప్రయోజనాలను వివరించేవాడు. చదువుకు పేదరికం అడ్డుకాదని, ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించారు.. ఆ అన్నదమ్ములు. గత విద్యాసంవత్సరంలో ఇద్దరూ ఒకేసారి ఎంబీబీఎస్లో సీట్లు సాధించారు. విద్యాభ్యాసాన్ని అంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీట్లు సాధించి తమ తండ్రికి బహుమతిగా ఇచ్చారు. చినపాక రాకేష్ ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కళాశాల మహేశ్వరంలో, రెండో కుమారుడు చినపాక రితీష్ ప్రభుత్వ మెడికల్ కళాశాల కుత్బుల్లాపూర్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. వైద్యం అంటే వ్యాపారంగా మారిన నేపథ్యంలో మంచి డాక్టర్లుగా తయారై ప్రజలకు సేవ చేస్తామని వారు పేర్కొంటున్నారు.
ముగ్గురు పిల్లలను డాక్టర్లు చేసిన నాన్న..
మిర్యాలగూడ : పట్టణంలోని సీతారాంపురం ప్రాంతానికి చెందని ఎస్కె.సుబాని తొలుత ప్రైవేట్ టీచర్గా పని చేశారు. తర్వాత కలెక్టరేట్లో ఉద్యోగం సాధించి డిప్యూటీ తహసీల్దార్ బాధ్యతలు నిర్వహించారు. నిబద్ధతతో పని చేసి పలుమార్లు ఉత్తమ అవార్డులను సైతం అందుకున్నారు. ఆయనకు తమ నలుగురు పిల్లలను డాక్టర్లను చేయాలన్న లక్ష్యంతో వారిని ఉన్నత చదువులు చదివించారు. ప్రస్తుతం ఇద్దరు కుమారులు, ఒక కూతురు ప్రభుత్వ డాక్టర్లుగా కొనసాగుతుండగా మరో కుమారుడు ఎఫ్సీఐలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. భార్య మహమూబాబేగంతో కలిసి ఎస్కె.సుబాని పిల్లలను సమాజంలో ఆదర్శంగా నిలిపారు.
నాన్న ప్రోత్సాహంతోనే..
మర్రిగూడ : మర్రిగూడ మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నక్క శ్రీనివాస్యాదవ్ ఆండాలు దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. పదో తరగతి పూర్తి చేసిన శ్రీనివాస్ వ్యవసాయం చేసుకుంటూ.. లారీ డ్రైవర్గా పనిచేశాడు. ప్రస్తుతం మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పదవిలో ఉన్నారు. నలుగురు సంతానంలో పెద్ద కుమార్తె అయిన నక్క సంధ్య బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి ఉద్యోగానికి సన్నద్ధమవుతోంది. రెండవ కుమార్తె స్వాతి బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం మెట్రో పాలిటిన్ జలమండలి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తోంది. మూడవ కుమార్తె ప్రియాంక డిగ్రీ పూర్తి చేసి రాచకొండ కమిషనరేట్లో సివిల్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది. కుమారుడు సాయితేజ పెండెకంటి లా 4వ సంవత్సరం చదువుతున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన స్వాతి, ప్రియాంక మాట్లాడుతూ తండ్రి ప్రోత్సాహంతోనే ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు సాధించామని తెలిపారు.
తల్లి లేని లోటు తెలియనీయకుండా..
మోత్కూరు: భార్య చనిపోయినప్పటికీ మరో వివాహం చేసుకోకుండా తన పిల్లలకు తల్లి లేని లోటు తెలియనీయకుండా ఉన్నత చదువులు చదివిస్తున్నాడు మోత్కూరులోని అంబేద్కర్నగర్ కాలనీకి చెందిన కురుమిళ్ల రమేష్. రమేష్కు మంజులతో 30ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె శ్రీకళ, కుమారులు దేవేందర్, కరుణాకర్ ఉన్నారు. మంజుల అనారోగ్యంతో 18ఏళ్ల క్రితం మృతిచెందింది. పిల్లలు చిన్న వయస్సులోనే ఉండగానే భార్య చనిపోవడంతో రమేష్ తన బాధను దిగమింగుకుంటూ మేసీ్త్రగా పనిచేస్తూ పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు శ్రీకళ బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి సౌదీ అరేబియాలో నర్సింగ్ ఉద్యోగం చేస్తోంది. పెద్ద కుమారుడు దేవేందర్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కుమారుడు కరుణాకర్ డీఎంఎల్టీ కోర్సు చదువుతున్నాడు. తన పిల్లలకు తల్లి లేని లోటును తీర్చడంతో పాటు వారిని బాగా చదివించి ప్రయోజకులుగా చేస్తున్న రమేష్ను పలువురు అభినందిస్తున్నారు.
అన్నదమ్ములిద్దరూ వైద్య విద్య

నడిపించిన నాన్న

నడిపించిన నాన్న

నడిపించిన నాన్న

నడిపించిన నాన్న

నడిపించిన నాన్న

నడిపించిన నాన్న

నడిపించిన నాన్న

నడిపించిన నాన్న