
నృసింహుడి సన్నిధిలో భక్తుల సందడి
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. రెండో శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. క్యూకాంప్లెక్స్, క్యూలైన్లు, ముఖ మండపం, మాడ వీధులు, కొండ కింద భక్తులు కిటకిటలాడారు. ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. 40వేలకు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.49,88,217 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.
యాదగిరీశుడిని దర్శించుకున్న
ఛత్తీస్గఢ్ పీఎస్సీ చైర్పర్సన్
లక్ష్మీనరసింహస్వామిని ఛత్తీగఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(సీజీపీఎస్సీ) చైర్పర్సన్ రీటా శాండిల్య శనివారం దర్శించుకున్నారు. ఆమెకు అర్చకులు, తహసీల్దార్ గణేష్ స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు.
రమణేశ్వరంలో నమక
మంత్రాల ప్రవచనాలు
భువనగిరి: భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని రమణేశ్వరంలో గల శివశక్తి షిర్డీ సాయి అనుగ్రహ మహాపీఠంలో శనివారం సిద్ధ గురు రమణానంద మహర్షి 66 నమక మంత్రాలపై ప్రవచించారు. అనంతరం మహాపీఠం ఆవరణంలో రుద్ర హవనం, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

నృసింహుడి సన్నిధిలో భక్తుల సందడి