
ఆయిల్పామ్తో ప్రతినెలా ఆదాయం
చండూరు, గట్టుప్పల్ : నీటి వసతి కలిగిన రైతులు ఆయిల్పామ్ సేద్యం చేసి మూడేళ్ల తర్వాత నెలనెలా ఆదాయం పొందవచ్చని సూర్యాపేట ఎస్పీ కొత్తపల్లి నరసింహ అన్నారు. ఆయన తన స్వగ్రామం చండూరు మండలం కొండాపురంలో 2021–2022లో తన సొంతభూమి 8 ఎకరాల్లో ఉద్వానశాఖ ద్వారా ఆయిల్పామ్ మొక్కలను నాటారు. మొక్కలు నాటి నేటికి మూడేళ్లు ముగిసిన సందర్భంగా ఆదివారం మొదటిసారి ఆయిల్పామ్ గెలలను తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్పామ్ మొక్కలు నాటిన నుంచి అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ సేంద్రియ ఎరువుల వాడడం వల్ల ఎనిమిది ఎకరాల్లో తొలిసారి 3 టన్నుల దిగుబడి సాధించామని తెలిపారు. ఈ పంట సాగు చేస్తే 30 సంవత్సరాలపాటు ఆదాయం పొందవచ్చన్నారు. ప్రతి రైతు ఆయిల్పాం సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్వాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి, నియోజకవర్గ అధికారి రావుల విద్యాసాగర్, పతంజలి కంపెనీ ఫీల్డ్ అధికారి శ్రీను, ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ రైతులు పాల్గొన్నారు.
ఫ సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ