ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి

Mar 25 2025 2:25 AM | Updated on Mar 25 2025 2:21 AM

నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేవించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి దరఖాస్తులను జాప్యం చేయకుండా పరిష్కరించాలన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే.. ఎందుకు కాలేదో ఫిర్యాదుదారులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌ వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘దర్తీ ఆబ జన జాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌’ పథకం కింద తిరుమలగిరి సాగర్‌ మండలం, రంగుండ్ల తండాలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. తండాలో జల్‌ జీవన్‌ కింద పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ద్వారా 10 మీటర్ల లోతున వాన నీటి కట్టడాలను చేపట్టాలని సూచించారు. గ్రామంలో అన్ని ప్రభుత్వ సంస్థల్లో సోలార్‌ లైట్లు, 10 హెచ్‌పీ సోలార్‌ పంప్‌, పబ్లిక్‌ టాప్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రంగుండ్లలో చేపట్టే పనులు ఇతర తండాలకు మోడల్‌గా నిలవాలని సూచించారు. 52 గిరిజన తండాల్లో ఈ పథకాన్ని అమలు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, ఇన్‌చార్జి డీఆర్‌ఓ వై.అశోక్‌రెడ్డి, స్పెషల్‌ కలెక్టర్‌ నటరాజ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement