సీఎం సభా ఏర్పాట్లు పక్కాగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సీఎం సభా ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

Mar 24 2025 6:23 AM | Updated on Mar 24 2025 6:22 AM

ఉగాది పర్వదినాన సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా హుజూర్‌నగర్‌లో రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభం సందర్భంగా నిర్వహించే సభా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం హుజూర్‌నగర్‌ పట్టణంలోని ఫణిగిరి గుట్టకు వెళ్లే రోడ్డులో సీఎం సభా ప్రాంగణ ఏర్పాటుకు మంత్రి జిల్లా అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం సభ ఏర్పాట్లపై జిల్లా అధికారులలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలోని రేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీకి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, ఎస్పీ నర్సింహ, అదనపు కలెక్టర్‌ రాంబాబు, ఇరిగేషన్‌ సీఈ రమేష్‌బాబు, ఆర్‌టీసీ ఆర్‌ఎం జానిరెడ్డి, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, సీఐ చరమందరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి, నాయకులు యరగాని నాగన్న, సీహెచ్‌ లక్ష్మీనారాయణరెడ్డి, తన్నీరు మల్లిఖార్జున్‌, కోతి సంపత్‌రెడ్డి, శివరాంయాదవ్‌, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement