రాజీవ్‌ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

రాజీవ్‌ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోండి

Apr 6 2025 12:49 AM | Updated on Apr 6 2025 12:49 AM

రాజీవ

రాజీవ్‌ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోండి

కందనూలు: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువవికాసం పథకం కోసం జిల్లాలోని బీసీ, ఈబీసీ నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, అభివృద్ధి శాఖ అధికారి ఖాజానాజిమ్‌ అలీ అప్సర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనాభా ప్రాతిపదికన జిల్లా, మున్సిపాలిటీ, మండలాలకు యూనిట్లు కేటాయిస్తారని, రూ.50 వేలు ఖర్చయ్యే యూనిట్లకు ప్రభుత్వం వందశాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వ్యయంతో కూడిన ప్రాజెక్టులకు 90 శాతం సబ్సిడీ, 10 శాతం బ్యాంకు రుణం, రూ.2 లక్షల వరకు 80 శాతం, రూ.4 లక్షల వరకు ఉన్న యూనిట్లకు 70 శాతం సబ్సిడీ ఇచ్చి మిగిలిన 30 శాతం బ్యాంకు రుణాల ద్వారా గ్రౌండింగ్‌ చేస్తారన్నారు. నిరుద్యోగులు స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించుకోవడానికి ఈనెల 14 వరకు గడువు ఉందని చెప్పారు.

బీజేపీ బలోపేతానికి

కృషి చేద్దాం

కందనూలు: జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని, నాయకులు, కార్యకర్తలందరూ కలిసికట్టుగా సహకరించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లాస్థాయి పదాధికారుల సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి మదగని శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందించి, రైతులు, మహిళలు, యువత, వివిధ వర్గాల సమస్యలపై ఉధృతంగా పోరాడాలని తీర్మానిచారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధులు సుధాకర్‌రెడ్డి, దిలీప్‌చారి, జిల్లా మాజీ అధ్యక్షుడు సుధాకర్‌రావు, రాష్ట్ర నాయకులు, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు.

పట్టుబడిన దొడ్డు బియ్యం గోదాంకు తరలింపు

పెద్దకొత్తపల్లి: మండలంలోని కొత్తపేట బాలాజీ రైస్‌మిల్లులో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్న 624 క్వింటాళ్ల దొడ్డు బియ్యాన్ని శనివారం కొల్లాపూర్‌ సివిల్‌ సప్లయ్‌ గోదాంకు తరలించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌ ఎముల నాయక్‌ తెలిపారు. అలాగే రైస్‌మిల్‌ యజమాని సునీల్‌కుమార్‌పై పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కే సు, ఎన్‌ఫోర్స్‌ కేసు నమోదు చేసినట్లు వివరించారు. బాలాజీ రైస్‌మిల్లు సీజ్‌ చేశారు.

రాజీవ్‌ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోండి 
1
1/1

రాజీవ్‌ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement