అర్జీలు సత్వరం పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలు సత్వరం పరిష్కరించాలి

Sep 1 2026 1:19 AM | Updated on Sep 1 2026 1:19 AM

ఐటీడీఏలో అర్జీలు స్వీకరిస్తున్న పీఓ

ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తున్న డీఆర్‌ఓ

డీఆర్‌ఓ రవికుమార్‌

ములుగు: ప్రజావాణిలో సమర్పించిన అర్జీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సత్వరం పరిష్కరించాలని డీఆర్‌ఓ రవికుమార్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తంగా 33 దరఖాస్తులు రాగా వాటిలో భూ సమస్యలపై 14, ఇందిరమ్మ ఇళ్లు 4, పింఛన్లపై 2, ఇతర శాఖలకు సంబంధించి 13 దరఖాస్తులు వచ్చినట్లు డీఆర్‌ఓ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించినట్లు తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులకు అధికారులు ప్రాధాన్యం ఇస్తూ నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

గిరిజన దర్బార్‌లో 8 వినతులు

ఏటూరునాగారం: మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన 8 వినతులు రాగా పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో స్వీకరించారు. వినతుల్లో ప్రధానంగా ఏటూరునాగారం మండలంలోని రొయ్యూరులో పట్టాలో వారసత్వం మార్పిడి చేయాలని గిరిజనుడు విన్నవించారు. వెంకటాపురం(కె) ముత్తారంలోని గిరిజన పాఠశాలల్లో ఏఎన్‌ఎంగా పనిచేసేందుకు అవకాశం కల్పించాలని ఓ గిరిజన మహిళ కోరారు. తాడ్వాయి మండలం బయ్కక్కపేట గ్రామానికి చెందిన ఓ క్రీడాకారుడు పారా నేషనల్‌ గేమ్స్‌లో పాల్గొనేందుకు ఆర్థికంగా సాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నారు. అలాగే వివిధ సమస్యలపై వచ్చిన వినతులు పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement