కేవీ మంజూరు గర్వకారణం: బీజేపీ | - | Sakshi
Sakshi News home page

కేవీ మంజూరు గర్వకారణం: బీజేపీ

Aug 26 2026 1:06 AM | Updated on Aug 26 2026 1:06 AM

వెంకటాపురం(ఎం): జిల్లాకు కేంద్రీయ విద్యాలయం(కేవీ) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంజూరు చేయడం గర్వకారణమని పార్టీ జిల్లా అధ్యక్షుడు బలరాం అన్నారు. మండల పరిధిలోని జవహర్‌నగర్‌ మోడల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని బీజేపీ నాయకులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భగా బలరాం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 54 కొత్త కేవీల్లో తెలంగాణకు నాలుగు మంజూరయ్యాయని తెలిపారు. వాటిల్లో ఒకటి జిల్లాకు కేటాయించడం ప్రధాని నరేంద్రమోదీ ఘనత అని వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు సైతం ప్రారంభమయ్యాయని తెలిపారు. పాఠశాల ఏర్పాటుకు కృషి చేసిన ప్రధాని మోదీ, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement