ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలో అక్రమాలు | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలో అక్రమాలు

Jun 16 2025 7:23 AM | Updated on Jun 16 2025 7:25 AM

జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి

ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బడే నాగజ్యోతి అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం మండలంలోని నార్లాపూర్‌ గ్రామంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఽగ్రామస్తులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లు పూర్తిగా అనర్హులకే కేటాయించారని ధ్వజమెత్తారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయకుండా పార్టీ కార్యకర్తలకు, డబ్బులిచ్చిన వారికే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని తెలిపారు. అనర్హులను ఎంపిక చేసిన జాబితాలపై అధికారులు ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు సకాలంలో రైతు భరోసా చెల్లించడంతో పాటు సన్న ధాన్యానికి ఇచ్చే రూ.500 బోనస్‌ వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సకాలంలో రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించాలన్నారు. మంత్రి సీతక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అఽధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందించకుండా ఎన్నికల స్టంట్‌గా విడుదల చేసి ప్రజలను మభ్యపెడితే ఊరుకునేది లేదన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందించాలన్నారు. లేని పక్షంలో అర్హులైన లబ్ధిదారుల పక్షాన ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్‌ గోవింద్‌నాయక్‌, మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య, మహిళా మండలి అధ్యక్షురాలు సోమ నాగమ్మ, మాజీ ఎంపీటీసీ కుక్కల శ్రీనివాస్‌, మాజీ సర్పంచ్‌ గొంది ఽశ్రీధర్‌, మేడారం జాతర మాజీ చైర్మన్‌ కాక లింగయ్య, నాయకులు రతన్‌సింగ్‌, మొక్క భాస్కర్‌, తాడూరి శుభాష్‌రెడ్డి, పత్తి గోపాల్‌రెడ్డి, కొమురయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement