
రంగాపూర్ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం
ఎస్ఎస్తాడ్వాయి: మండల పరిధిలోని రంగాపూర్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం హెచ్ఎం ఈసం కృష్ణయ్య పాఠశాలను పున:ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని గిరిజన విద్యార్థులకు ఇంగ్లిష్ విద్యాబోధన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం పాఠశాల ప్రవేశపెట్టిందన్నారు. తల్లిదండ్రులు పిల్ల లను ప్రైవేటు పాఠశాలలకు పంపించవద్దని సూచించారు. బడిబాట కార్యక్రమంలో 21 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలో చేర్పించి రంగాపూర్ పాఠశాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాప సమ్మయ్య, కొక్కెర రమేష్, మైపతి సంతోష్కుమార్ పాల్గొన్నారు.
రామప్పలో
బెల్జియం దేశస్తులు
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని సోమవారం బెల్జియంకు చెందిన జాస్ బైకేన్, అన్నిసుస్కోపిలు సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకుని ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ వెంకటేశ్ వారికి వివరించగా రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్గా ఉందని కొనియాడారు.
నిబంధనల మేరకు
స్టోన్ క్రషర్లు నడిపించాలి
ములుగు రూరల్: ప్రభుత్వ నిబంధనల మేరకు స్టోన్ క్రషర్లు నడిపించాలని డీఎస్పీ రవీందర్ అన్నారు. ఈ మేరకు సోమవారం మల్లంపల్లి మండల పరిధిలోని మహ్మద్గౌస్పల్లిలో ఉన్న సహాయాద్రి, వాసుదేవ స్టోన్ క్రషర్లను తనిఖీ చేశారు. క్రషర్ అనుమతి పత్రాలు, పేలుడు పదార్ధాలను పరిశీలించారు. పేలుడు పదార్ధాలను నిల్వ చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ సురేష్, ఎస్సై వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించకుంటే గుర్తింపు రద్దు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల గుర్తింపును రద్దుచేయాలని ప్రోగ్రెస్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (పీఎస్ఎఫ్ఐ) జిల్లా అధ్యక్షుడు పసుల వినయ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ధనార్జనే ధ్యేయంగా భావిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బు దోచుకుంటున్నారని ఆరోపించారు. పాఠశాలలోనే పుస్తకాలు, బట్టలు అమ్ముతూ విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కి తమకు ఇష్టం వచ్చిన ఫీజులు పెట్టుకొని వసూలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు.
18, 19 తేదీల్లో
ఎంపిక పోటీలు
భూపాలపల్లి అర్బన్: స్పోర్ట్స్ పాఠశాలల ఎంపికకు ఈ నెల 18, 19వ తేదీల్లో మండల స్థాయి ఎంపిక క్రీడాపోటీలను నిర్వహించనున్నట్లు మండల ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి దేవానాయక్ తెలిపారు. సోమవారం మండలంలో పీఈటీలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. హకీంపేట, కరీంనగర్, ఆదిలా బాద్ స్పోర్ట్స్ స్కూల్ పాఠశాలలకు మండలస్థాయిలో ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలి పారు. 4వ తరగతి కోసం 8నుంచి 9ఏళ్లలోపు బాలబాలికలు హాజరుకావాలని సూచించారు. పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో పీఈటీలు పాల్గొన్నారు.

రంగాపూర్ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం

రంగాపూర్ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం

రంగాపూర్ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం