
రైతులకు పెట్టుబడి సాయం
ములుగు రూరల్: వానకాలం పంట పెట్టుబడికి ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అందిస్తుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా మల్లంపల్లి మండల పరిధిలోని రైతు వేదికలో కలెక్టర్ దివాకర, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్కుమార్, రైతులు పాల్గొన్నారు. రైతులకు వర్షాకాలంలో పంటల సాగుపై వ్యవసాయ శాఖ అధికారులకు అందుబాటులో మాట్లాడుతాం. నకిలీ విత్తనాల అమ్మకాలు, రవాణా వంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలోగ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మండల వ్యవసాయ అధికారి పరమేశ్వర్, శ్రీధర్, వినయ్, వ్యవసాయ విస్తర్న అధికారులు జ్యోతిరాణి, కావ్య, కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్గౌడ్, రైతులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్రెడ్డి