
స్థలాల దుర్వినియోగం సరికాదు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి స్థలాలను ప్రభుత్వ అవసరాలకు కేటాయిస్తూ యాజమాన్యం దుర్వినియోగానికి పాల్పడుతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. కేటీకే 8వ గనిలో ప్రధాన రహదారి పక్కన సింగరేణి యాజమాన్యం 15 ఏళ్లకు పైగా పెంచినటువంటి వందలాది చెట్లను తొలగించి ప్రభుత్వ సబ్స్టేషన్ నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు ఆరోపించారు. సబ్ స్టేషన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించడమే కాకుండా చెట్ల తొలగింపు, భూమి చదును చేసేందుకు సివిల్, ఎస్టేట్, ఫారెస్ట్ అధికారులను కేటాయించి కంపెనీ యంత్రాలను సైతం కేటాయించారని మండిపడ్డారు. ప్రభుత్వ అవసరాల కోసం సింగరేణి నిధులను దుర్వినియోగం సరికాదన్నారు.