
ప్రభుత్వానికి రా రైస్ ఇవ్వలేం..
యాసంగి వడ్లు కొనుగోలు చేసి ప్రభుత్వానికి రా రైస్ ఇవ్వలేం అని జిల్లాలోని 40 మంది రైస్ మిల్లర్లు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. యాసంగిలో వచ్చే ధాన్యంతో బాయిల్డ్ బియ్యం మాత్రమే వస్తాయని ఈ విషయాన్ని సివిల్ సప్లయీస్ అధికారులకు చెప్పామని తెలిపారు. అధికారుల ఒత్తిడికి లోనై ధాన్యం దించుకుంటే మిల్లర్లు పూర్తిగా దివాళాతీసే పరిస్థితి నెలకొంటుందని వివరించారు. గతంలో సైతం ప్రభుత్వానికి బాయిల్డ్ రైస్ మాత్రమే ఇచ్చేవాళ్లమని వివరించారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని రైస్ మిల్లర్లను ఆదుకోవాలని జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్కుమార్, కార్యదర్శి సహోదర్రెడ్డి, ఎలగందుల మోహన్, కొమురవెల్లి హరినాథ్, సుదర్శన్రెడ్డి, అక్కల రఘోత్తం, భద్రయ్య, వినయ్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
– రైస్ మిల్లర్లు
కలెక్టర్ దివాకరకు వినతిపత్రం ఇస్తున్న రైస్మిల్లర్లు