ఇంగ్లిష్‌పై భయాన్ని పోగొట్టాలి | - | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌పై భయాన్ని పోగొట్టాలి

Apr 11 2025 1:02 AM | Updated on Apr 11 2025 1:02 AM

ఇంగ్లిష్‌పై భయాన్ని పోగొట్టాలి

ఇంగ్లిష్‌పై భయాన్ని పోగొట్టాలి

ములుగు: విద్యార్థులకు ఇంగ్లిష్‌పై భయాన్ని పోగొట్టాలని కలెక్టర్‌ దివాకర సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గల సమావేశ మందిరంలో జిల్లాలోని 54 ప్రాథమిక పాఠశాలల్లో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు దిశ ఫౌండేషన్‌, ఈఎల్‌ఎఫ్‌ సహకారంతో 80రోజుల పాటు నిర్వహించిన లెర్న్‌టురీడ్‌ ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సెల్ఫ్‌ ఇంట్రడక్షన్‌ చేసుకోవడం, రోల్‌ప్లే, సంభాషణ చూసి కలెక్టర్‌ విస్తుపోయారు. దిశ ఫౌండేషన్‌ కృషిని కొనియాడారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు మెమెంటోతో పాటు సర్టిఫికెట్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మొదటి దశ కార్యక్రమం విజయవంతం కావడంతో ఇంగ్లిష్‌ బోధన కార్యక్రమాన్ని ఎనిమిది దశల వరకు నిర్వహించాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ పాణిని, సెక్టోరల్‌ అధికారి అర్షం రాజు, సాంబయ్య, దిశ ప్రతి నిధులు ఐశ్వర్య, ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.

పోషణ పక్షంపై అవగాహన కల్పించాలి

పోషణ పక్షం–2025 కార్యక్రమంపై గ్రామాల వారీగా విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్‌ దివాకర సూచించారు. ఈ మేరకు ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహించనున్న పోషణ పక్షం వాల్‌పోస్టర్‌ను గురువారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు గ్రామస్థాయి సిబ్బంది తగిన కృషి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో 640అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ, జిల్లా సంక్షేమ అధికారి కూచన శిరీష, డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, డీపీఆర్వో రఫీక్‌, తహసీల్దార్‌ విజయభాస్కర్‌, సూపర్‌ వైజర్లు, కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

కలెక్టర్‌ టీఎస్‌.దివాకర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement