ఏటూరునాగారం: మండల కేంద్రంలోని రైతు వేదికలో రబీ 2024–25 సీజన్లో ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, కన్నాయిగూడెం, వెంకటాపురం(కె) మండలాలకు చెందిన ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ఏఓలు, ఏఈఓలు, వరికోత మిషన్ యజమానులకు ఒక రోజు శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పౌరసరఫరాల అధికారి సయ్యద్ పైసల్ హుస్సేన్, సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి మాట్లాడుతూ జిల్లాకు నూతనంగా 40ప్యాడీ క్లినర్స్ వచ్చాయని తెలిపారు. తేమశాతం పరీక్షించే మిషనరీని అందుబాటులో పెట్టుకుని రైతులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే లారీల్లో లోడ్ చేసి తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆపరేటివ్ ఆఫీసర్ సర్దార్ సింగ్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ డీఆర్డీఓ గోవింద్ చౌహన్, మండల వ్యవసాయ అధికారి వేణుగోపాల్, ఐదు మండలాల ఏఈవోలు, ఎంఏవోలు, సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ రామచందర్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై శిక్షణ