ఏటూరునాగారం: మండల కేంద్రంలో రేపు ఐటీడీఏలో గల గిరిజన భవన్లో యువజనోత్సవాల పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వం యూత్ అండ్ అఫైర్స్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువకేంద్రం వరంగల్ వారు జిల్లాలో జిల్లా స్థాయి యువజన ఉత్సవాల పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన అంశం పంచ్ ప్రాన్ అనే కార్యక్రంలో భాగంగా పద్య రచన, డ్రాయింగ్, ప్రకటన పోటీలు, ఫోక్ డ్యాన్స్ గ్రూప్, ఫోక్ డ్యాన్స్ సింగిల్, సైన్స్ మేల్ సింగిల్, సైన్స్ మేల్ గ్రూప్ ఈ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9908069469లో సంప్రదించాలని కోరారు.
జాతీయ కౌమార విద్యా
సదస్సుకు డాక్టర్ రామయ్య
ములుగు: ప్రాంతీయ విద్యాసంస్థ(ఎన్సీఈఆర్టీ) బోపాల్లో నేడు(సోమవారం), మంగళవారం జరగనున్న జాతీ య కౌమార విద్యా సదస్సుకు తెలంగాణ రాష్ట్రం నుంచి తాను ఎంపికై నట్లు ములుగు మండలం అబ్బాపురం ప్రభు త్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, మనో విజ్ఞానవేత్త డాక్టర్ కందాల రామయ్య ఆది వారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌమారదశలో బాలికలు ఒత్తిడిని ఎదుర్కునే విధానాలు అనే అంశంపై చేసిన పరిశోధన, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై వాటి ప్రభావాన్ని తెలిపేలా వివరించనున్నట్లు వెల్లడించారు. జాతీయ మెంటర్, జాతీయ, రాష్ట్ర రీసోర్స్ పర్సన్గా మనో విజ్ఞానశాస్త్రంతో పాటు భావో ద్వేగ ప్రజ్ఞ, ఒత్తిడి, ఒత్తిడిని ఎదుర్కునే విధానాలు, మంత్రణం, మార్గదర్శనం అంశాలపై పరిశోధనలు చేస్తున్నట్లు వివరించారు. ఈ జాతీయ కౌమార విద్యా సదస్సుకు ఎంపికై న రామయ్య ను డీఈఓ పాణిని, ఏఎంఓ మల్లారెడ్డి, హెచ్ఎం భాస్కర్ తదితరులు అభినందించారు.
భగత్సింగ్ ఆశయాలను కొనసాగించాలి
ములుగు రూరల్: భగత్సింగ్ ఆశయాలను కొనసాగించాలని డెమోక్రటిక్ స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ జక్కుల శరత్కుమార్ అన్నారు. భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల వద్ద వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. స్వాతంత్ర పోరాటంలో భగత్సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు వీరోచితంగా పోరాడి ఉరికంబం ఎక్కిన మహోన్నత వ్యక్తులను వారి సేవలను కొనియాడారు. నేటి సమాజంలో విద్యార్థులు తమ హక్కులను తెలుసుకొని ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వరుణ్, విద్యార్థులు పాల్గొన్నారు.
మతోన్మాదంపై పోరాటానికి సిద్ధంకావాలి
భూపాలపల్లి అర్బన్: కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న మతోన్మాద వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటానికి సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు పిలుపునిచ్చారు. భగత్సింగ్ 94వ వర్ధంతిని ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ.. భారతీయుల హృదయాలను ఉత్తేజ పరచిన విప్లవకారులు భగత్సింగ్కు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసిందన్నారు. నాటి ఉద్యమ పోరాటంలో చేసిన త్యాగాలను గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తితో నేటితరం యువత బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
రేపు యువజనోత్సవాల పోటీలు
రేపు యువజనోత్సవాల పోటీలు