
హీరో రామ్చరణ్, దర్శకుడు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకునేందుకు సన్నాహాలు ఆరంభమైనట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ ఓ కథను సిద్ధం చేసి, రామ్ చరణ్కు వినిపించారట. ఈ కథ నచ్చడంతో సినిమా చేసేందుకు రామ్చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్నగర్ సమాచారం.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థలు నిర్మించనున్నాయని, త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుందని భోగట్టా. కాగా ప్రస్తుతం ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్నారు రామ్చరణ్. అలాగే దర్శకుడు సుకుమార్తో రామ్చరణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. మరి..‘పెద్ది’ తర్వాత రామ్చరణ్ సినిమా సుకుమార్తో ఉంటుందా? లేక త్రివిక్రమ్తోనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.