
Prabhas Salaar Movie Budget Will Increase Of Above 200 Crores: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న చిత్రం 'సలార్'. హీరోయిన్ శ్రుతీ హాసన్ ఆద్య రోల్ పోషిస్తోంది. ప్రముఖ నటుడు జగపతిబాబు రాజమన్నార్గా కనిపించనున్నాడు. అయితే ఇప్పటివరకూ కరోనా కారణంగా షూటింగ్లు ఆలస్యం కావడంతో వాటి బడ్జెట్లు కూడా పెరిగిపోయాయి. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ మొదట అనుకున్నదానికంటే విపరీతంగా పెరిగిందని సమాచారం.
ప్రస్తుతం రూ. 200 కోట్లకుపైగా ఈ సినిమా కోసం ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ బడ్జెట్లో అత్యధిక భాగం ప్రభాస్కే చెల్లించాల్సి ఉండగా, యాక్షన్ సీన్స్ కోసం భారీగా ఖర్చు పెట్టనున్నారట. ఈ నేపథ్యంలోనే సలార్ రెండు భాగాలుగా వస్తుందన్న వార్తలను సలార్ చిత్రబృందం ఖండించింది. అలాంటిదేమి లేదని తేల్చి చెప్పింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తేనే ఆ బడ్జెట్కు వీలవుతుందని పలువురు సలహా ఇచ్చారని టాక్. ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఇదిలా ఉంటే వరుస పాన్ ఇండియా చిత్రాలతో దుమ్మురేపుతున్న ప్రభాస్ సినిమాలన్నింటి బడ్జెట్ కలిపితే ఏకంగా రూ. 1000 కోట్లకుపైనే ఉంది.