పదేళ్ల తర్వాత...  | Oka Laila Kosam Combo To Repeat Again | Sakshi
Sakshi News home page

పదేళ్ల తర్వాత... 

Apr 1 2024 12:15 AM | Updated on Apr 1 2024 12:05 PM

Oka Laila Kosam Combo To Repeat Again - Sakshi

హీరో నాగచైతన్య, హీరోయిన్‌ పూజా హెగ్డే మరోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. 2014లో విడుదలైన ‘ఒక లైలా కోసం’ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి జోడీగా నటించనున్నారని టాక్‌. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్‌’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు నాగచైతన్య. ఆ తర్వాతి చిత్రాన్ని ‘విరూపాక్ష’ ఫేమ్‌ కార్తీక్‌ దండు దర్శకత్వంలో చేయనున్నారట.

నాగచైతన్య కోసం మిస్టరీ, పౌరాణిక, థ్రిల్లర్‌ అంశాలతో కథ రెడీ చేస్తున్నారట కార్తీక్‌ దండు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన పూజా హెగ్డేని కథానాయికగా తీసుకోవాలని మేకర్స్‌ అనుకుంటున్నారని భోగట్టా. ఇక 2022లో విడుదలైన ‘ఆచార్య’ సినిమా తర్వాత (‘ఎఫ్‌ 3’లో ప్రత్యేక పాట చేశారు) మరో తెలుగు సినిమా కమిట్‌ కాలేదు పూజాహెగ్డే. నాగచైతన్యతో నటించే తాజా చిత్రం ఆమెకు తెలుగులో పెద్ద కమ్‌బ్యాక్‌ అవుతుందని టాక్‌. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘దేవా’ అనే సినిమా చేస్తున్నారు పూజా హెగ్డే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement