
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా, మలయాళ నటుడు టొవినో థామస్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణ కర్ణాటకలో జరిగింది. లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది.
ఈ షెడ్యూల్లో భాగంగానే ఎన్టీఆర్పై ప్రస్తుతం ఓ సాంగ్ను చిత్రీకరిస్తున్నారట మేకర్స్. ఈ సాంగ్ స్క్రీన్ పై విజువల్గా అద్భుతంగా ఉంటుందని ఫిల్మ్నగర్ సమాచారం. అయితే ఈ పాట రెగ్యులర్ సాంగ్ కాదని, దేశభక్తిని గుర్తుచేసేలా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2026 జూన్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్.