సందడిగా సినీ అవార్డుల వేడుక

Movies, TV Incentive Awards Function At Chennai - Sakshi

సాక్షి, చెన్నై: సినీ, బుల్లితెర నటులకు ప్రోత్సాహక అవార్డుల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం స్థానిక వడపళనిలోని శిఖరం హాల్‌లో సందడి సందడిగా జరిగింది. డాక్టర్‌ అనురాధ జయరామన్‌ మహా ఫైన్‌ ఆర్ట్స్, కలైమామణి నెల్‌లై సుందరరాజన్‌ యునైటెడ్‌ ఆర్టిస్ట్స్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.

విశ్రాంతి న్యాయమూర్తి ఎ.రామమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని నటీనటులకు ప్రోత్సాహక అవార్డులను అందజేశారు. ఈ వేదికపై నటుడు ఆరియన్, బుల్లితెర నటుడు జిస్ను మీనన్, నటి రమ్యకృష్ణన్, లతాభాను, సీనియర్‌ పాత్రికేయుడు ఎం.టి.రామలింగం తదితరులు అవార్డులు అందుకున్నారు. కార్యక్రమంలో గ్లోబ ల్‌ మధుకృష్ణ, కోడంబాక్కం శ్రీ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top