బేబీ మూవీతో ఫేమస్ అయిన టాలీవుడ్ జంట ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య. వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రానుంది. ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ పేరుతో వస్తోన్న మూవీకి ఆదిత్యహాసన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని మనసా వాచా అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు శ్రీహర్ష లిరిక్స్ అందించగా.. ఎస్పీ చరణ్, కేఎస్ చిత్ర పాడారు. ఈ సాంగ్ను హేషమ్ అబ్దుల్ వాహబ్ కంపోజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 11న థియేటర్లలో సందడి చేయనుంది.


