పావు గంట కథ విని ఓకే చెప్పారు: మానస శర్మ | Director Manasa Sharma Interview about Rakasa | Sakshi
Sakshi News home page

పావు గంట కథ విని ఓకే చెప్పారు: మానస శర్మ

Mar 25 2026 3:11 AM | Updated on Mar 25 2026 3:11 AM

Director Manasa Sharma Interview about Rakasa

‘‘రాకాస’ కథని నిహారికగారు ఓ పావు గంట వినగానే నమ్మకంతో వెంటనే ఓకే చెప్పారు. ఈ సినిమా ఔట్‌పుట్‌ కూడా ఆమెకు నచ్చాలని నేను మరింత బాధ్యతగా పని చేశాను. డైరెక్టర్‌గా ‘రాకాస’ నా తొలి ఫీచర్‌ ఫిల్మ్‌. నాకు వెబ్‌ సిరీస్‌లు చేసిన అనుభవం ఉండటంతో ‘రాకాస’ తీయడం సవాల్‌గా అనిపించలేదు’’ అని డైరెక్టర్‌ మానస శర్మ పేర్కొన్నారు. సంగీత్‌ శోభన్, నయన్‌ సారిక జంటగా మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రాకాస’. జీ స్టూడియోస్‌ సమర్పణలో నిహారిక కొణిదెల, ఉమేష్‌ కుమార్‌ బన్సల్‌ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 3న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో చిత్రదర్శకురాలు మానస శర్మ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మాది శ్రీకాకుళం. నేను మొదటగా యూట్యూబ్‌లో ‘మ్యాడ్‌ హౌస్‌’ చేశాను. ఆ తర్వాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి క్రియేటర్, రైటర్‌గా చేశాను. అనంతరం ‘బెంచ్‌ లైఫ్‌’ సిరీస్‌ చేశాను. ‘రాకాస’ని ఫ్యాంటసీ, అడ్వెంచర్, కామెడీ జానర్లో తీశాం. సంగీత్‌ అద్భుతమైన నటుడు. అతని కామెడీ టైమింగ్‌ నాకు ఇష్టం.

నయన్‌ సారిక ప్రతిభ, నటన చూసి ఈ చిత్రంలోకి తీసుకున్నాం. థియేటర్లో చూసి, ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిన చిత్రమిది. అనుదీప్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నిహారికగారు మంచి నిర్మాత. ఇక నా తర్వాతి ప్రాజెక్టుల కోసం ప్రస్తుతం కొన్ని కథలు, ఐడియాలు ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్‌ చేసినా కూడా అందులో కామెడీ ప్రధానంగా ఉండేలా చూసుకుంటాను’’ అని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement