టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సరిగ్గా మూడేళ్ల క్రితం పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ పొలిటిషియన్ భూమా నాగిరెడ్డి కూతురు మౌనికను ఆయన పెళ్లాడారు. వీరిద్దరి పెళ్లి ఫిల్మ్నగర్లోని మంచు లక్ష్మీ నివాసంలో గ్రాండ్గా జరిగింది. ఆ తర్వాత వీరికి ఓ కుమార్తె కూడా జన్మించింది. ప్రస్తుతం ఈ జంట తమ లైఫ్ను హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. మనోజ్ సైతం సినిమాలతో కెరీర్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే వీరిద్దరు ఓ పెళ్లి వేడుకలోనూ సందడి చేశారు.
ఇదంతా పక్కనపెడితే మంచు మనోజ్ పెళ్లి తర్వాత చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంచు ఫ్యామిలీలో విష్ణుకు, మనోజ్కు మధ్య గొడవలు కూడా జరిగాయి. మౌనికతో పెళ్లి తర్వాతే ఈ వివాదాలు తలెత్తాయి. మంచు మనోజ్- మౌనిక పెళ్లి మోహన్బాబుకు ఇష్టం లేదని గతంలో వార్తలు కూడా వచ్చాయి.
అయితే మంచు మనోజ్- మౌనిక పెళ్లి గురించి ఆమె సిస్టర్, ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె వీరిద్దరి పెళ్లికి మోహన్బాబు త్వరగా ఒప్పుకోలేదన్నారు. మంచు మనోజ్- మౌనికను పెళ్లి చేసుకుంటానని మమ్మల్ని అడిగారని చెప్పింది. అయితే తాము ఈ పెళ్లి వెంటనే జరగాలని మనోజ్తో చెప్పామని అఖిల ప్రియ వెల్లడించారు. ఈ పెళ్లికి మా ఫ్యామిలీ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని ఆమె తెలిపారు. కాకపోతే మా తమ్ముడు, నేను ఎఫెక్ట్ అవ్వకూడదనే త్వరగా పెళ్లి చేసుకోవాలని మాత్రమే చెప్పామని భూమా అఖిల ప్రియ పేర్కొన్నారు.
కాగా.. మంచు మనోజ్-మౌనిక రెడ్డిల వివాహం ఫిల్మ్నగర్లోని మంచు లక్ష్మీ నివాసంలో జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో మనోజ్-మౌనికలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2023 మార్చి 3వ తేదీన రాత్రి 8.30నిమిషాలకు వేదమంత్రాల సాక్షిగా మనోజ్- మౌనిక మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.


