Sakshi News home page

వేడుక వేళ.. ఆనంద హేల 

Published Sun, Apr 7 2024 1:53 AM

Amala Paul shared the photos of the Seemantam ceremony on social media - Sakshi

హీరోయిన్‌ అమలా పాల్‌ తల్లి కాబోతున్నారు. తాజాగా తన సీమంతం వేడుక ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. భర్త జగత్‌ దేశాయ్‌తో కలిసి అమలా పాల్‌ గుజరాత్‌లోని సూరత్‌లో ఈ వేడుక జరుపుకున్నారు.

‘ట్రెడిషన్‌ అండ్‌ లవ్‌’ అనే క్యాప్షన్‌తో అమలా పాల్‌ షేర్‌ చేసిన ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ వేడుక వేళ అమల, జగత్‌ల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక కొన్ని సంవత్సరాలు రిలేషన్‌షిప్‌ కొనసాగించి 2023లో అమలా పాల్, జగత్‌ దేశాయ్‌ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement