బడిని చూడాలిక.. సమస్యలు తీర్చాలిక
● సౌకర్యాలు కల్పిస్తేనే నాణ్యమైన విద్య ● ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే స్వగ్రామాల్లోని బడుల్లో అన్నీ సమస్యలే..
టీచర్ల కొరత...
గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. 196 మంది విద్యార్థులుండగా బాలురు 94, బాలికలు 102 మంది ఉన్నారు. ఇంగ్లిష్, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు కొరత ఉంది. అలాగే ఫర్నిచర్ సమస్య ఉంది. పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం లేదు. కంప్యూటర్ ల్యాబ్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు మరింత విజ్ఞానం అందించాల్సిన అవసరం ఉంది.


