భూ భారతితో సమస్యలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

భూ భారతితో సమస్యలు పరిష్కారం

Jun 19 2025 7:58 AM | Updated on Jun 19 2025 7:58 AM

భూ భారతితో సమస్యలు పరిష్కారం

భూ భారతితో సమస్యలు పరిష్కారం

సదాశివపేటరూరల్‌(సంగారెడ్డి): ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టంతో రెవెన్యూ సమస్యలు పరిష్కారమవుతాయని టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వెల్టూర్‌, నందికంది గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. భూము లపై పూర్తి హక్కులను కల్పిచేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేస్తోందన్నారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం నందికందిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అధికారులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సరస్వతి, నాయబ్‌ తహసీల్దార్‌ బాలరాజ్‌, ఆర్‌ఐ గంగాధర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ రత్నాకర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కృష్ణ, మాజీ సర్పంచ్‌ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు సిద్దన్న, నాయకులు పాల్గొన్నారు.

టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement