
ప్రతి దరఖాస్తు ఆన్లైన్ చేయాలి
మనోహరాబాద్(తూప్రాన్): భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేయాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులకు సూచించారు. బుధవారం మండలంలోని దండుపల్లిలో చేపట్టిన రెవెన్యూ సదస్సును సందర్శించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పీఓటి, సాదా బైనామాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. మనోహరాబాద్, దండుపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 39 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో డీటీ కౌషిక, ఆర్ఐ దీక్షిత్, సంపత్ పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేశ్