చిరు వ్యాపారులకు చేయూత చిరు వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు మెప్మా రూ.50 వేల వరకు వడ్డీలేని రుణాలను అందజేస్తోంది. వివరాలు 8లో u
గురువారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2025
నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై వారం రోజులు గడిచిపోయింది. రోడ్లపై బడి బస్సులు రయ్ రయ్మని విద్యార్థులతో తిరిగేస్తున్నాయి. అయితే వాటిలో ఎన్ని బస్సులు నిబంధనలు పాటిస్తున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా ఫిట్నెస్ చేయించుకోని బస్సులు ఉన్నాయనే విషయం ఆందోళన కలిగిస్తోంది. ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు, ఇప్పటికే 15 బస్సులను సీజ్ చేశారు.
– మెదక్జోన్/తూప్రాన్
జిల్లావ్యాప్తంగా 105 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వాటిలో 45 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో హాస్టళ్లలో ఉంటూ 20 వేల మంది చదువుకుంటుండగా, మరో 25 వేల మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు నిత్యం ఇంటి నుంచి బస్సులు, ఇతర వాహనాల్లో బడులకు వెళ్తున్నారు. వీరికోసం వివిధ పాఠశాలలకు చెందిన యాజమాన్యాలు 313 బస్సులను వినియోగిస్తున్నాయి. ఏటా బస్సుల ఫిట్నెస్ తప్పనిసరిగా చూడాల్సిన బాధ్యత ఆర్టీఏ అధికారులపై ఉంటుంది. దీంతో వారు 99 బస్సులు కాలం చెల్లినవిగా గుర్తించి, వాటిలో పిల్లలను తరలించవద్దని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఫిట్నెస్ లేనివి మరో 15 బస్సులను సీజ్ చేశారు. పాఠశాలలు ప్రారంభం కాకముందే వాటిని సరిచేసుకోవాల్సిన యాజమాన్యాలు నిర్లక్ష్యం వహించాయి. దీంతో అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ చర్యలు తీసు కుంటున్నారు. బడి బస్సు రోడ్డెక్కాలంటే 32 నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందులో ఫిట్నెస్, టైర్లు, సాంకేతిక సామర్థ్యం వంటి అంశాలపై అధికారులు పరిశీలించి సర్టిఫికెట్ జారీ చేస్తారు.
చర్యలు తప్పవు
పాఠశాల బస్సులను నిబంధనల ప్రకారం నడపాలి. జిల్లావ్యాప్తంగా 313 బస్సులు ఉండగా, ఇప్పటివరకు 15 బస్సులను సీజ్ చేశాం. అలాగే 99 బస్సులు కాలం చెల్లినవిగా గుర్తించాం. ఫిట్నెస్ చేయని పాఠశాలల వాహనాలను వెంటనే చేయించాలి. లేనిచో చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
– వెంకటస్వామి, ఆర్టీఏ, మెదక్
న్యూస్రీల్
జిల్లాలో 99 కాలం చెల్లిన బస్సులు
ఇప్పటివరకు 15 సీజ్.. ముమ్మరంగా కొనసాగుతున్న తనిఖీలు
బడి బస్.. ఫిట్లెస్!