
లక్ష్యం మేర రుణాలు ఇవ్వాలి
మెదక్జోన్: బ్యాంకర్లు ఈ వార్షిక సంవత్సరానికి కేటాయించిన రూ. 6,517.51 కోట్ల రుణాలను రైతులతో పాటు ఇతర రంగాలకు అందించి లక్ష్యా న్ని చేరుకోవాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో కలిసి రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకర్లు నిర్దేశించిన రుణాలను అందిస్తేనే రైతులతో పాటు ఇతర రుణ గ్రహితలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. అలాగే రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా స్వయం ఉపాధి రంగాలలో లక్ష్యాలను నిర్దేశించుకొని రుణాలు అందించాలన్నారు. గతేడాది వార్షిక రుణ ప్రణాళిక రూ. 5,857 కోట్ల రుణాల లక్ష్యం ఉండగా, ఇచ్చింది మాత్రం రూ. 4,366.84 కోట్లేనని తెలిపారు. ఈసారి అలా కాకుండా నిర్దేశించిన రుణాలు వందశాతం అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, ఎల్డీఎం నరసింహమూర్తి, నాబార్డ్ డీడీఎం కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూముల పరిశీలన
హవేళిఘణాపూర్(మెదక్)/మెదక్ కలెక్టరేట్: హవేళిఘణాపూర్ శివారులో ఉన్న ప్రభుత్వ భూములను కలెక్టర్ రాహుల్రాజ్ బుధవారం పరిశీలించారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, జిల్లా ఎలక్ట్రిసిటీ స్టోర్, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ తదితర నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వ పరిశీలించి పూర్తి వివరాలను మ్యాప్ను తయారు చేసి అందజేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాకు నూతన నర్సింగ్ కాలేజ్ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు.
కలెక్టర్ రాహుల్రాజ్