
విద్యాభివృద్ధికి పరిశ్రమల చేయూత
ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి
జిన్నారం(పటాన్చెరు): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పరిశ్రమలు పెద్దపీట వేస్తున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం గుమ్మడిదల మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. గుమ్మడిదలలో హానర్ ల్యాబ్ పరిశ్రమ సహకారంతో సీసీ రోడ్లు, అంతర్గత మురికి కాలువలు, అన్నారం మోల్డ్ టెక్ పరిశ్రమ సహకారంతో నిర్మించిన జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల, వావిలాలలో నిర్మించిన భవనాలను ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి పరిశ్రమలు సహకారం అభినందనీయమన్నారు. ఈసందర్బంగా విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చెర్మన్ ప్రభాకర్, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.