
సీఏం రేవంత్రెడ్డి చిత్ర పటానికి పాలభిషేకం
కల్హేర్(నారాయణఖేడ్): రైతు భరోసా డబ్బులు జమచేయడంతో కల్హేర్లో మంగళవారం కాంగ్రెస్ నాయకులు సీఏం రేవంత్రెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి చిత్ర పటాలకు పాలభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పోచయ్య, నాయకులు దేవదాస్, రవీందర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
పదోన్నతితో మరింత బాధ్యత
అదనపు ఎస్పీ సంజీవరావు
సంగారెడ్డి జోన్: పదోన్నతితో విధి నిర్వహణలో మరింత బాధ్యత పెరుగుతుందని జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించిన చైతన్య సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది సైబరాబాద్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయనను ఘనంగా సన్మించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కల్యాణి, అధికారులు అశోక్, వెంకటేశం, సిబ్బంది తదితరులు ఉన్నారు.
నిరంతర విద్యుత్ సేవలు
అందిస్తాం: ఎస్ఇ శంకర్
పాపన్నపేట(మెదక్): జిల్లాలో వినియోగదారులకు నిరంతర విద్యుత్ సేవలు అందిస్తామని విద్యుత్ శాఖ ఎస్ఇ శంకర్ తెలిపారు. పాపన్నపేటలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో 125 విద్యుత్ సబ్ స్టేషన్లున్నాయన్నారు. అభివృద్ధి పనుల కోసం జిల్లాకు రూ.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.జిల్లాలో విద్యుత్ పరికరాలు సత్వరం అందించేందుకు ప్రభుత్వం 5 ఎకరాల భూమి కేటాయించిందన్నారు. లైన్మెన్లు నిరంతర సేవలు అందించేందుకు వారికి సెల్ఫోన్లు అందజేసినట్లు చెప్పారు. ప్రతీరోజు 587 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. 2021 నుంచి 2024 వరకు 13,440 వ్యవసాయ బోర్లకు రూ.77.88 కోట్లతో విద్యుత్ కనెక్షన్లు అందించామన్నారు.
మహిళా సంఘాల
సేవలు భేష్
సంగారెడ్డి టౌన్: జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల శిక్షణలో జిల్లాలోని సంఘాలకు విశేష గుర్తింపు ఉంటుందని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జెండర్ అధికారులు పేర్కొన్నారు. సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్ ఖాన్ పేటలో మంగళవారం రాజస్థాన్ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా స్థిరపడేందుకు వివిధ పథకాలతో లబ్ధి పొందుతున్నారని మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలు ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండి సామాజిక అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం పలు ప్రదేశాలలో పర్యటించారు. కార్యక్రమంలో రాష్ట్ర సామాజిక సంఘ సేవకురాలు దేవి, డీఆర్డీఏ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ న్యాయవాదులకు ఉచిత శిక్షణ
మెదక్ కలెక్టరేట్: న్యాయశాస్త్ర పట్టభద్రులైన జిల్లాకు చెందిన ఎస్సీ యువతీ, యువకులకు ప్రభుత్వం స్టయిఫండ్తో పాటు ఉచిత శిక్షణ ఇస్తామని ఎస్సీ కార్పొరేషన్ అధికారి విజయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన అభ్యర్థులకు స్థానికంగా ఉండే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వద్ద జూనియర్ చేరే అవకాశం కల్పిస్తామన్నారు. మూడేళ్లపాటు శిక్షణ సమయంలో స్టయిఫండ్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు.