
ఉపాధి పథకాలకు వంద శాతం సబ్సిడీ
పీడీ శ్రీనివాస్రావు
శివ్వంపేట(నర్సాపూర్): జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అందిస్తున్న పథకాలను సన్న, చిన్నకారు రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పెద్దగొట్టిముక్లల్లో ఉపాధి హామీ నిధులతో నిర్మించతలపెట్టిన పశువుల షెడ్డు, ఫిష్ పాండ్, ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. కూలీలతో చర్చించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఉపాధి కూలీలకు వంద శాతం సబ్సిడీపై పశువుల షెడ్డు, షిష్ పాండ్లు నిర్మించుకోవచ్చని తెలిపారు. జాబ్కార్డు కలిగి, ఏడాదిలో ఇరవై రోజులు ఉపాధి కూలి పనులు చేసిన సన్న, చిన్నకారు రైతులు ఈ పథకాలకు అర్హులన్నారు. పాడి ౖరైతులకు పశువుల షెడ్డుకు 90 వేలు, మత్స్యకారుల సహకార సంఘానికి చేపల చెరువులు నిర్మించుకునేందుకు రూ.10 లక్షలు నిధులతో ఫిష్ పాండ్లు నిర్మిస్తామన్నారు.