అందరికా.. కొందరికా? | - | Sakshi
Sakshi News home page

అందరికా.. కొందరికా?

Jun 18 2025 7:28 AM | Updated on Jun 18 2025 7:28 AM

అందరికా.. కొందరికా?

అందరికా.. కొందరికా?

ఖాతాల్లోకి రైతు భరోసా

మొదటి విడతగా మూడెకరాల లోపు వారికి జమ

ఉమ్మడి జిల్లాలో 8.38లక్షల ఎకరాలకు రూ.502 కోట్లు

గత యాసంగిలో 2.27లక్షల మంది దూరం

ఈ సారైనా పూర్తి స్థాయిలో అందేనా?

ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం ‘రైతు భరోసా’ కొందరికా? లేక అందరికా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 17,18,981 ఎకరాలకు రూ.859 కోట్లకుపైగా రైతు బంధును అందించేవారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గత యాసంగిలో 4ఎకరాలలోపు వారికే రైతు భరోసా జమ చేసింది. దీంతో 40శాతం మంది రైతులు పెట్టుబడి సాయానికి దూరమయ్యారు. ఈసారి వానాకాలంలోనైనా అందరికీ జమ చేయాలని రైతులు కోరుతున్నారు.

– సాక్షి, సిద్దిపేట

ప్రస్తుతం అందిన రైతు భరోసా ఇలా..

జిల్లా రైతులు ఎకరాలు రూ.కోట్లల్లో

సిద్దిపేట 2,54,711 3,02,418 181,45,13,296

మెదక్‌ 2,25,764 2,24,319 134,59,15,589

సంగారెడ్డి 2,65,400 3,11,292 186,77,56,219

గత యాసంగిలో రైతు భరోసా ఇలా..

జిల్లా రైతులు ఎకరాలు రూ.కోట్లల్లో

సిద్దిపేట 2,62,238 3,33,238 199,94,28,372

మెదక్‌ 2,26,970 2,34,500 140,70,00,000

సంగారెడ్డి 2,67,236 3,33,416 200,05,00,000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement